రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం

  • ఉండి మండలం చెరుకువాడ సమీపంలో రోడ్డు ప్రమాదం
  • ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా యాక్సిడెంట్
  • దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న నేతలు
ఏపీలో ఈరోజు అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉండి మండలం చెరుకువాడ సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఆయన మృతి చెందారు. అంగన్ వాడీ వర్కర్ల సమ్మెలో పాల్గొని వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ సంభవించింది. షేక్ సాబ్జీ మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Shaikh Sabji
MLC
Road Accident

More Telugu News